‘తెలుగమ్మాయిలకి అవకాశాలు ఇవ్వరని నేను చెప్పను. ప్రతి శుక్రవారం పది మంది కొత్త కథానాయికలు వస్తుంటారు. దాంతో పోటీ పెరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎవరి ఆధిపత్యమూ ఉండదు’’ అంటున్నారు యామినీ భాస్కర్. విజయవాడ నుంచి వచ్చిన అచ్చ తెలుగమ్మాయి యామిని. ‘కీచక’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘నర్తనశాల’లో నాగశౌర్య సరసన నటించింది. ఈ సందర్భంగా యామినీ సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... ‘‘చిత్ర పరిశ్రమలో కథానాయికలకి అందంతో పాటు, ప్రతిభ కీలకం. అన్ని రకాల పాత్రలకీ సరిపడేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ముఖ్యం. జీవితం నేర్పిస్తుందంటారు కదా. అలా ఈ మూడేళ్ల అనుభవంలో చాలా నేర్చుకొన్నా. నటన పరంగా, లుక్ పరంగా కూడా నాలో నేను చాలా మార్పులు చూసుకొన్నా. నా ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. ‘నర్తనశాల’తో నా కెరీర్ మారిపోతుందని నమ్ముతున్నా’’. * ‘‘ఒక తెలుగమ్మాయిగా నా సినీ ప్రయాణం ఇష్టంగా, అప్పుడప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తూ ముందుకు సాగుతోంది. ఇక్కడ అదృష్టం కూడా కీలకమే. టైమ్ రావాలంటుంటారు కదా. ఆ మాటని బాగా నమ్ముతా. ఈ సినిమా విషయంలో టైమే కలిసొచ్చింది. చిత్రీకర